
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొత్త చార్జ్ షీట్ ను దాఖలు చేసిన అధికారులు.. సంచలన వివరాలను వెల్లడించారు. నవీ ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరుడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఈ ఐదుగురికి సంబందాలు ఉన్నాయని, సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రతో పాటు గతంలో అనేక నేరాలకు పాల్పడినట్టుం తెలిపేరు.
కొత్త ఛార్జ్ షీట్ ప్రకారం.. సల్మాన్ ఖాన్ హత్య చేయడం కోసం బిష్ణోయ్ గ్యాంగ్ తో రూ.25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇందుకోసం 2023 ఆగస్ట్ నుండి 2024 ఏప్రిల్ వరకు ప్రణాళిక రూపొందించారట. సల్మాన ఖాన్ ప్రతీ కదలికను వారు గమనించారా. దాదాపు అరవై నుండి డెబ్భై మంది ప్రతీరోజు ముంబైలోని సల్మాన్ ఇల్లు, గెస్ట్ హౌస్, షూటింగ్ సెట్స్ ఇలా ప్రతీ విషయాన్నీ వారు గమించారని తెలిపారు.
అంతేకాదు.. హత్య కోసం AK-47లు, AK-92లు, M16 రైఫిల్స్, టర్కిష్ తయారు చేసిన జిగానా పిస్టల్తో సహా పాకిస్తాన్ నుండి అధునాతన తుపాకీలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేశారట. హత్య చేయడం కోసం ఉత్తర అమెరికా నుండి ఒక మైనర్ బాలుడిని నియమించారట, ప్లానింగ్ అంతా పూర్తయి బిష్ణోయ్ ఆదేశాల కోసం ఆ బాలుడు ఎదురుచూస్తున్నటుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దాఖలు చేసిన ఈ కొత్త ఛార్జ్ షీట్ సంచలనం రేపుతోంది.