బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల ఆత్మబలిదానాలను, వారి త్యాగాలను పాటల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పడంలో ‘దరువు’ సాంస్కృతిక వేదిక కీలక పాత్ర పోషించిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు.
సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. దరువు సాంస్కృతిక వేదిక ఏర్పడి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 20న రవీంద్రభారతిలో దరువు జాతర పేరిట భారీ సభ నిర్వహిస్తున్నట్లు వేదిక వ్యవస్థాపకులు దరువు ఎల్లన్న, దరువు అంజన్నతో కలిసి ఆయన ప్రకటించారు. ఈ వేడుకలకు సంబంధించి రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
