
ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అది జరిగిన వారం తర్వాత పాకిస్తాన్లోని బాలాకోట్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. జైషే- మహ్మద్ శిక్షణా శిబిరాన్ని ధ్వంసం చేసింది. పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులను హతమార్చింది. ఈ ఎయిర్ ఫోర్స్ దాడుల ఆధారంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా వస్తోంది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం టెర్రరిస్ట్ అటాక్లో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు బుధవారం ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీమ్ పుల్వామాలో నివాళులర్పించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ మానుషి చిల్లర్తో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.