కపుర్తల: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సంచలన కామెంట్స్ చేశారు. కెప్టెన్ ఇంటి వద్దే ఉండి, ప్రధాని మోడీ కాళ్లు నాకుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొత్త పార్టీ పెట్టిన కెప్టెన్.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై సిద్ధూ ఫైర్ అయ్యారు. ‘నాకు అన్ని ద్వారాలు మూసుకుపోయాయని కెప్టెన్ చెప్పారు. కానీ ఇప్పుడు చూడండి.. ఆయన ఇంటి వద్దే ఉంటూ మోడీ కాళ్లు నాకుతున్నారు’ అని సిద్ధూ విమర్శించారు.
#WATCH | Captain (Amarinder Singh) said that doors have been closed for Sidhu, but see today...he is sitting at home and is licking the feet of Modi: Punjab Congress president Navjot Singh Sidhu at a rally in Kapurthala, Punjab (18.12) pic.twitter.com/4Sjo4HjS9W
— ANI (@ANI) December 20, 2021
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కపుర్తలాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సిద్ధూ పైవ్యాఖ్యలు చేశారు. కాగా.. సిద్ధూతోపాటు పార్టీ అధిష్టానంతో ఏర్పడిన విభేదాల అనంతరం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అమరిందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని పెట్టారు. 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టారు. ఈ విషయాన్ని బీజేపీ పంజాబ్ ఇన్ ఛార్జ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కెప్టెన్ అమరిందర్ కలసి మీడియాకు వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం: