నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని 1,81,379 మంది రైతుల ఖాతాల్లో రూ.222.42 కోట్ల రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ముథోల్ నియోజకవర్గంలో 85,468 మంది రైతులకు రూ.118.34 కోట్లు, ఖానాపూర్ నియోజకవర్గంలో 62,632 మంది రైతులకు రూ.75.31 కోట్లు, నిర్మల్ నియోజకవర్గంలో 63,752 మంది రైతులకు రూ.69.37 కోట్లు జమ అయినట్లు చెప్పారు
