తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 200 మంది డీఎస్పీలను, 12 మంది ఐపీఎస్ లను, నలుగురు ఐఏఎస్ లను, 39 మంది ఏఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం లేటెస్ట్ గా (ఫిబ్రవరి 17న) మరో 12 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది.
నిజామాబాద్ అడిషనల్ డీసీపీగా ఎస్.రమేష్ , ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా సురేందర్ రావు, హైదరాబాద్ ట్రాఫిక్-3 అడిషనల్ డీపీసీగా రామారావు, సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీపీసీగా శ్రీనివాసులు, మెదక్ అడిషనల్ ఎస్పీగా మహ్మద్ రెహమాన్, నిర్మల్ అడిషనల్ ఎస్పీగా శివకుమార్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ రవిగుప్త.