ఖజురాహోలో 1,484 మందితో కథక్ డ్యాన్స్ గిన్నిస్​ వరల్డ్ రికార్డ్

ఖజురాహోలో 1,484 మందితో కథక్ డ్యాన్స్ గిన్నిస్​ వరల్డ్ రికార్డ్

భారతీయ ప్రాంతీయ నృత్యాలకు ఉన్న ఆధరణ పెద్దదే. మధ్యప్రదేశ్​లోని ఖజురాహోలో ఫిబ్రవరి 20న 50వ  డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ డ్యాన్స్ ఫెస్టివల్ లో మంగళవారం (ఫిబ్రవరి 20)న ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. ఒకేసారి 1484 మంది కళాకారులు కలిసి 20 నిమిషాల పాటు కథక్ డ్యాన్స్  చేశారు. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కింది. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్​లోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. వీరిలో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. 

1484 మంది కళాకారులు కలిసి ఒకేరకమైన దుస్తుల్లో దేవాలయ ప్రాంగణంలో కథక్ నృత్యాన్ని ప్రదర్శించారు. 'రాగ బసంత్​' అనే పాటకు సుమారు 20 నిమిషాలు నృత్యం చేశారు. వారిలో రాష్ట్రం​లోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఉన్నారు. వారితో పాటు విదేశీ కథక్ కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో జబలపుర్​కు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. డ్యాన్సర్స్ వేరు వేరు ప్రాంతాలోని వారు కావున, వారంతా వర్చవల్ గా ప్రాక్టీస్ చేశారు. వీరిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభినందించారు. ఖజురహోలో గిరిజన, జానపద కళల శిక్షణ కోసం దేశంలోనే తొలి గురుకులాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.