టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు

టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: అధికారుల అవినీతి, ఏసీబీ దాడుల నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని జీహెచ్ంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 13మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్ల(ఏసీపీ)ను బదిలీ చేశారు. వీటితోపాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోని క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న 14 మంది సెక్షన్ ఆఫీసర్లను సైతం బదిలీ చేశారు. మొత్తం 27 మంది అధికారులకు స్థానం చలనం కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.