వరంగల్ జిల్లాలో 8 నెమళ్ల మృతి

 వరంగల్ జిల్లాలో 8 నెమళ్ల మృతి

వరంగల్ జిల్లా: పర్వతగిరి పట్టణ శివార్లలోని దేవిలాల్ తండాలో 8 నెమళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. తండాలోని బోరు వద్ద ఆరు ఆడ, రెండు మగ నెమళ్లు చనిపోయినట్లు తండా వాసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారుల సూచన మేరకు స్థానిక వెంటర్నరీ డాక్టర్ నరేష్ నెమళ్ల కు పోస్టు మార్టం నిర్వహించి శాంపిల్స్ ల్యాబ్ కు పంపించారు. 
ప్రస్తుతం వరినాట్లు వేస్తుండడంతో చుట్టుపక్కల పంట పొలాల్లో పెస్టిసైడ్స్ కలిపిన తాగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు. రీజనల్ ల్యాబోరొటేరీ నుంచి శాంపిల్స్ వచ్చిర తర్వాతనే నెమళ్లు మృతి చెందడానికి దారితీసిన కారణాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.