తిమ్మాపూర్ గ్రామంలో 800 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

తిమ్మాపూర్ గ్రామంలో 800 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని హనుమాన్ సాయి రైస్ మిల్ పై మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సివిల్ సప్లై, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 800 క్వింటాళ్ల పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించామన్నారు. 

రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మిల్లు నిర్వాహకుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం సభ్యులు తెలిపారు. దీనిపై సమగ్ర నివేదికను కలెక్టర్, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేస్తామని చెప్పారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఓఎస్డీ అంజయ్య, సివిల్ సప్లై ఆఫీసర్ జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.