ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి చంపేశారు

ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి చంపేశారు
  • అసిఫ్ నగర్ పీఎస్ పరిధిలోని గుడిమల్కాపూర్ లో దారుణం

హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. గుడిమల్కాపూర్ లో ఏజాజ్ అనే వ్యక్తి పై కత్తులతో పొడిచి పొడిచి హతమార్చారు. ఇంట్లోకి దూరిన దుండగులు ఏజాజ్ పై దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచి చంపి పరారయ్యారు. నిమిషాల వ్యవధిలో జరిగిపోయిందీ ఘటన. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో  సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.