- ఐటీ కారిడార్లో బోర్డు తిప్పేసిన ల్యాబ్ టూ ల్యాండ్’ కంపెనీ
- సైబరాబాద్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు.. ఇద్దరు డైరెక్టర్లపై కేసు
గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్లో ఓ అగ్రి కల్చర్ బేస్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కెమికల్స్ స్టాక్ పేరుతో రెండు తెలుగు రాష్ర్టాల్లో రూ. 15 కోట్ల ఫ్రాడ్ చేసింది. ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. కంపెనీ మేనేజ్ మెంట్ పారిపోయింది. దీంతో బాధితులు గురువారం సైబరాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం.. రాయదుర్గం నాలెడ్జ్సిటీలోని టీ హబ్లో ల్యాండ్ టూ ల్యాబ్అగ్రిటెక్ సొల్యూషన్స్ కంపెనీ ఉంది.
ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, క్రాప్ న్యూట్రీషన్, న్యూ కెమికల్ ఇన్నోవేషన్స్వంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమను నడుపుతుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో పలువురు డీలర్లకు వ్యవసాయ సంబంధిత రూ. 50వేల చొప్పున కెమికల్ స్టాక్ ఇచ్చి, ఒక్కొక్కరి వద్ద రూ. 5 లక్షలు వసూలు చేసింది. డీలర్స్ స్టాక్, డబ్బులపై కంపెనీ మేనేజ్ మెంట్ ను నిలదీస్తే తప్పించుకొని తిరుగుతున్నారని బాధితులు వాపోయారు.
ALSO READ :- Allu Arjun Wax statue: గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
సుమారు 500 మంది డీలర్లు ఉన్నట్లు, దాదాపు 15 కోట్లపైగా చీటింగ్ చేసినట్లు ఆరోపించారు. సీఈఓ ఆదిత్య దేశ్పాండే తప్పించుకొని తిరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. బాధితుల కంప్లయింట్ తో కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లపై కేసు నమోదు చేసినట్టు రాయదుర్గం పోలీసులు తెలిపారు.