Allu Arjun Wax statue: గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

Allu Arjun Wax statue: గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి(Gangotri) నుండి పుష్ప(Pushpa) వరకు ఆయన ప్రయాణం ఎందరికో ఇన్స్పిరేషన్. ఒక్కొక్క సినిమాకు ఆయన పడిన కష్టం, ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచాలనే తపన ఆయన్ని స్టైలీష్ స్టార్ ని చేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో ఆయన స్థాయి ఇండియా బార్డర్ దాటేసి విదేశాలకు పాకింది. పుష్ప సినిమాలో ఆయన డైలాగ్స్, మ్యానరిజమ్స్, డాన్స్ కి ప్రపంచం మొత్తం ఫిదా అయిపొయింది. వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ స్టార్స్ అందరు పుష్ప నామస్మరణే చేశారు.  దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆయన వీడియో సే వైరల్ అయ్యాయి. అంతలా తన నటనతో అదరగొట్టేశాడు అల్లు అర్జున్. 

ఇక ఈ సినిమాలో ఆయన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా వరించింది. ఇక తాజాగా అల్లు అర్జున్ కెరీర్ లో మరో ప్రత్యేకమైన సంఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. దుబాయిలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో అల్లు అర్జున్ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఈ ఘనత సాధించిన అతికొద్దిమంది ఇండియన్ స్టార్స్ లిస్టులో చోటు దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఈ మైనపు విగ్రహాన్ని మార్చి 28న ప్రారంభించారు అల్లు అర్జున్. 

ఈ ప్రత్యేకమైన సందర్బంలో  తన కెరీర్, తన అభిమానుల గురించి తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.. ఈ రోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. నా మొదటి చిత్రం గంగోత్రి రిలీజైన రోజే.. నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ నా 21 సంవత్సరాల సినీ ప్రయాణం మరుపురానిది. ఈ ప్రయాణంలో నాతోపాటు ఉన్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా ఆర్మీ(అభిమానులు) అందించిన అమితమైన ప్రేమకు, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు.. రానున్న రోజుల్లో కూడా మీ అందరినీ మరింత గర్వించేలా చేస్తానని ఆశిస్తున్నాను.. అంటూ ఎమోషనల్ ట్వీట్ రాసుకొచ్చారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 లో నటిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.