
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, చిప్ల తయారీ కంపెనీ ఎన్విడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత స్కిల్స్ పెంచడం, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచడం, స్టార్టప్లకు సాయం చేయడంలో కలిసి పనిచేయనున్నారు.
ఒప్పందం ప్రకారం, రాబోయే రెండేళ్లలో పదివేల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ స్కిల్స్లో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్విడియాతో కలిసి ఆంధ్రా ప్రభుత్వం కలిసి పని చేస్తుంది. ఏఐ విద్య కోసం ఎన్విడియా కరికులమ్ గైడెన్స్, టెక్నికల్ ట్రైనింగ్ అందిస్తుంది.