- రాహుల్, అసదుద్దీన్ది ఔరంగజేబ్ స్కూల్: అనురాగ్ సింగ్ ఠాకూర్
హైదరాబాద్, వెలుగు : లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్తో సహా నిందితులంతా జైలుకు పోయారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. లిక్కర్ స్కాం కేసులో నిజంగా కవిత నిర్దోషి అయితే, బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ఒవైసీ ఇద్దరూ ఔరంగజేబు స్కూల్ కు చెందిన వారేనని విమర్శించారు.
బుధవారం హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ఆఫీసులో అనురాగ్సింగ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ మహిళా నేత చేతిలో ఓడిపోయారని.. అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు హైదరాబాద్ లో తమ పార్టీ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఈ ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్ ఓడిపోతున్నారని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 40 సీట్లకు కూడా గెల్చుకోలేదని ఎద్దేవా చేశారు.