జగన్ కు నీళ్లమ్మి ప్రజల నోట్లో కేసీఆర్ మట్టికొట్టిండు

జగన్ కు నీళ్లమ్మి ప్రజల నోట్లో కేసీఆర్ మట్టికొట్టిండు

తెలంగాణ నీళ్లను జగన్ కు అమ్మి కేసీఆర్ తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 TMCలకు ఒప్పుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలని మండిపడ్డారు సంజయ్. డ్యామ్ ల దగ్గర ఎందుకు బందోబస్తు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుల మధ్య ఘర్షణ పేరుతో కొత్త నాటకం తెరలేపే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ అప్పుడు చంద్రబాబుతో.. ఇప్పుడు జగన్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కేంద్రం ఇన్వాల్వ్ అయింది కాబట్టే... ఏపీ కడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టు  ఆగిందన్నారు సంజయ్.