
న్యూఢిల్లీ: దేశంలో న్యూస్ ఛానల్స్ రేటింగ్ డేటాను మార్చి 17న విడుదల చేస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చి కౌన్సిల్ (బార్క్) ఇండియా ఇవాళ ప్రకటించింది. ఛానెళ్ల రేటింగ్ను ట్యాంపరింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ముంబయి పోలీసులు కొన్ని ఛానల్స్పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో అంటే 17 నెలల క్రితం న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ ఆపేశారు.
అయితే కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహా మేరకు మళ్లీ న్యూస్ ఛానల్స్ రేటింగ్ను పునః ప్రారంభించనున్నారు. దేశంలో న్యూస్ ఛానల్స్ ద్వారా దాదాపు రూ. 32 వేల కోట్ల ప్రకటను యాడ్స్ ప్రసారం అవుతుంటాయి. వీటిని రేటింగ్స్ వీటిని ప్రభావితం చేస్తాయని ఆరోపణ. ఈ సంవత్సరం 10వ వారం అంటే మార్చి 17న రేటింగ్ను విడుదల చేస్తున్నట్లు బార్క్ తెలియజేసింది.