Air India: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఫ్లైట్ క్యాన్సిల్

Air India: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఫ్లైట్ క్యాన్సిల్

ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టడం పైలట్లను, ఎయిర్ పోర్ట్ అధికారులను ఆందోళనకు గురి చేసింది. దీంతో ఫ్లైట్ తిరుగు ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీ కొట్టడం రిటర్న్ జర్నీని క్యాన్సిల్ చేశారు అధికారులు.

ఢిల్లీ నుంచి శుక్రవారం (జూన్ 20) 5.31 గంటలకు బయల్దేరిన AI-2469 విమానం మార్గ మధ్యలో పక్షి ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. అయినప్పటికీ పుణెలో 7.14 గంటలకు సేఫ్ గా ల్యాండ్ చేసినట్లు తెలిపారు ఎయిర్ లైన్స్ అధికారులు. 100 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ బస్  A320 బర్డ్ స్ట్రైక్ కు గురైనట్లు ప్రకటించారు. 

ఈ విమానం వెంటనే మళ్లీ ఢిల్లీ తిరిగి ప్రయాణించాల్సి ఉంది. అయితే పక్షి ఢీ కొనటంతో సేఫ్టీ చెక్స్ చేసినట్లు చెప్పారు. ఫ్లైట్ ను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించారు. ప్యాసెంజర్ల కోసం ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ప్యాసెంజర్లకు బోర్డింగ్ సదుపాయాలు, రీఫండ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో వేరే ఫ్లైట్ ను ఏర్పాటు చేస్తు్న్నట్లు హామీ ఇచ్చారు.