రాష్ట్రంలోని తుగ్లక్ ​పాలనను అంతమొందిస్తాం.. బూర నర్సయ్యగౌడ్‌‌

రాష్ట్రంలోని తుగ్లక్ ​పాలనను అంతమొందిస్తాం.. బూర నర్సయ్యగౌడ్‌‌
  • ఉమ్మడి జిల్లా బీజేపీ ప్రబారి  
  • బూర నర్సయ్యగౌడ్‌‌


వర్ని, వెలుగు:  రాష్ట్రం లో సాగుతున్న కేసీఆర్​తుగ్లక్​పాలనను అంతమొందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి జిల్లా బీజేపీ ప్రభారీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. వర్ని మండల కేంద్రంలోని  ఓ​ఫంక్షన్‌‌ హాల్లో శనివారం  ప్రెస్​మీట్​నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం  ఏర్పడ్డ తెలంగాణను  కేసీఆర్‌‌ అప్పు, అవినీతి, అహంకార తెలంగాణగా మార్చారని ఫైర్​అయ్యారు. లిక్కర్,పేపర్ల లీకేజీ స్కామ్​లతో అంతా అవినీతిమయంగా మారిందన్నారు.  కేసీఆర్​కు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 30 లక్షల మంది ఉసురు  తగులుతుందన్నారు. ‘డబుల్’ ఇండ్ల పేరుతో లబ్ధిదారులకు ట్రిఫుల్​ఆర్​ సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. అకాల వర్షాలకు రైతులు నష్టపోతే వారిని ఆదుకోని సీఎం కేసీఆర్​అని మండిపడ్డారు. 


నియోజకవర్గాన్ని దోచుకుంటున్న స్పీకర్​కుమారులు


స్పీకర్‌‌ పోచారం ఇద్దరు కుమారులు  బాన్సువాడ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మొరం, కంకర, కాంట్రాక్టులు  చేస్తూ నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని నర్సయ్య గౌడ్​ఆరోపించారు.  బీజేపీలో చేరాలనుకునే  ఇతర పార్టీల లీడర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అకారణంగా అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ పోలీస్​వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.  వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్​లీడర్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.  బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​బస్వా లక్ష్మీ నర్సయ్య, బాన్స్​వాడ నియోజకవర్గ ఇన్​చార్జి మల్యాద్రిరెడ్డి, అరుణతార,  శంకర్‌  పాల్గొన్నారు. 


కేసీఆర్​ ను దేవుడు కూడా క్షమించరు


పిట్లం, వెలుగు:  అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుండా  సీఎం కేసీఆర్​ గోస పెడుతున్నారని,  ఆయనను దేవుడు కూడా క్షమించరని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్​ విమర్శించారు.   శనివారం జుక్కల్​ నియోజక వర్గంలో బీజేపీ  బూత్​లెవల్​ కమిటీ ప్రతినిధులతో బిచ్కుంద  మండల కేంద్రంలో నిర్వహించిన మీటింగ్​కు ఆయన హాజరయ్యారు.  ఈ సందర్భంగా  మాట్లాడుతూ రాష్ట్రంలో ఫసల్​బీమా అమలు చేయకపోవడం వల్లనే రైతులు నష్టపోతున్నారని వాపోయారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార,  సెక్రెటరీ రాము,   రాజు పాల్గొన్నారు.