వెరిఫికేషన్ తర్వాతే ఓటరు జాబితా ప్రకటించాలి : బీజేపీ నాయకులు

వెరిఫికేషన్ తర్వాతే ఓటరు జాబితా ప్రకటించాలి : బీజేపీ నాయకులు

ఆర్మూర్, వెలుగు : పూర్తి వెరిఫికేషన్ చేసిన తర్వాతే మున్సిపల్ ఫైనల్​ ఓటర్​ జాబితా ప్రకటించాలని బీజేపీ నాయకులు బుధవారం మున్సిపల్​ కమిషనర్​ శ్రావణిని కలిసి వినతిపత్రం అందజేశారు. మాజీ మున్సిపల్​చైర్మన్​ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ ఆర్మూర్​ లో ఓటర్ల విభజన, వార్డ్ ల విభజన సక్రమంగా లేదని, పెళ్ళైన వారి పేర్లు తొలగించేలేదని, కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో రాలేదని, ఓటర్ల జాబితా సవరణలు చేయాలని కోరారు. 

బీఎల్​వోలతో వెరిఫికేషన్ చేయించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ మందుల బాలు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, కార్యదర్శి పోల్కం వేణు, నాయకులు ఆకుల శీను, సుంకరి రంగన్న, జాగిర్ధర్ శీను, ఖాందేశ్​ ప్రశాంత్, బాండ్లపల్లి నర్సారెడ్డి, పోచంపాటి శ్రీను, కుమార్, బాశెట్టి రాజ్ కుమార్, శేఖర్, ఉదయ గౌడ్ కుక్ నూరు లింగన్న, విజయానంద్, మిరియాల కిరణ్, చిట్టి బాజన్న తదితరులు పాల్గొన్నారు.