- డిప్యూటీ కమిషనర్ కిషన్కు వినతి పత్రం అందజేసిన బొల్లారం నాయకులు
అమీన్పూర్, జిన్నారం, వెలుగు : మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీలో కలిసిన బొల్లారం డివిజన్ను శేరిలింగంపల్లి జోన్లో కలపాలని బొల్లారం నాయకులు డిప్యూటీ కమిషనర్ కిషన్ను కోరారు. ఈ మేరకు గురువారం మాజీ జడ్పీటీసీ కొలను బాల్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు డిప్యూటీ కమిషనర్ కిషన్కు వినతి పత్రాన్ని అందజేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్పూర్ డివిజన్లను శేరిలింగంపల్లి జోన్లో కలిపినట్లుగానే బొల్లారం డివిజన్ శేరిలింగంపల్లి జోన్లో కలపాలని కోరారు.
బొల్లారం డివిజ్ను కూకట్పల్లి డివిజన్లో కలపడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ను కలిసిన వారిలో మాజీ కౌన్సిలర్లు వేణుపాల్రెడ్డి, జైపాల్రెడ్డి, సాయికిరణ్రెడ్డి, బీరప్ప, శ్రీకాంత్యాదవ్, సతీశ్, మాజీ ఎంపీటీసీ రత్నం పాల్గొన్నారు.

