- చెన్నూరులో మంత్రి వివేక్వెంకటస్వామి ప్రచారం
- బీఆర్ఎస్ను వీడి మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక
కోల్బెల్ట్/చెన్నూరు, వెలుగు: సంక్షేమ పథకాలు అందించే సత్తా ప్రజా ప్రభుత్వానికి మాత్రమే ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం చెన్నూరు మున్సిపాలిటీలోని 1,2,3,4,6,9,10, 16,17,18 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు శ్రీరాంబట్ల రాణి, పెద్దింటి పద్మ, అంబటి శంకర్, పెండ్యాల సాగర్, నాయకపు వినయ్ కుమార్, సుద్దపల్లి సునీత, నీలం శ్రీనివాస్, సాధనబోయిన లావణ్య, అజీమోద్దీన్, నవాజోద్దీన్ తరఫున మంత్రి ప్రచారం చేశారు. చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్కు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అంతకు ముందు ఆయన గంగారోడ్లోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు.
గౌడ కులస్తులు, లీడర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 6వ వార్డులోని బీఆర్ఎస్ నేత ఉండ్రాలా పోచం(ఎరుకల పోచం) తన అనుచరులతో, 17వ వార్డు ఇండిపెండెంట్అభ్యర్థి గుజార్ చరణ్ సింగ్తోపాటు కిరణ్ సింగ్, కిషన్ సింగ్ సహా వంద మంది నేతలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
