ముగ్గురు హీరోలు.. మూడు నెలల ట్రైనింగ్

ముగ్గురు హీరోలు.. మూడు నెలల ట్రైనింగ్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబో ఏదంటే టక్కున గుర్తొచ్చేసింది మహేష్(Mahesh babu) అండ్ రాజమౌళి(Rajamouli)నే. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెడ్ తో, కానీ వినీ ఎరుగని రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. 

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం మూడు నెలల ట్రైనింగ్ లో పాల్గొననున్నాడట మహేష్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. మహేష్ తో పాటు ఈ ట్రైనింగ్ లో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా పాల్గొంటారని సమాచారం. ఆ ఇద్దరు మరెవరో కాదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్(Aamir khan), మరో స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranvir singh). ఈ ఇద్దరు హీరోలు కూడా ఈ ట్రైనింగ్ లో పాల్గొననున్నారట. 

ఈ న్యూస్ తెల్సుకున్న ఫ్యాన్స్ ఈ ఇద్దరు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సడెన్ గా వినిపిస్తున్న ఈ న్యూస్ తో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.

మహేష్ బాబు అంటేనే సినిమా ఓ రేంజ్ ఉంటుంది అనుకున్నాం. ఇక అమీర్, రణబీర్ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్లడం ఖాయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వార్త గనక నిజమైతే మాత్రం ఇండియా నుండి మరో వరల్డ్ క్లాస్ సినిమా వస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మరి ఈవార్త నిజమేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.