స్తంభంపైనే పోయిన ప్రాణాలు.. కరెంట్​షాక్​తో ఇద్దరి మృతి

స్తంభంపైనే పోయిన ప్రాణాలు.. కరెంట్​షాక్​తో ఇద్దరి మృతి

కామేపల్లి, వెలుగు: కరెంట్​షాక్​తో వేర్వేరు ప్రాంతాల్లో స్తంభంపైనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామానికి చెందిన రైతు సూర ప్రభాకర్(45) తమ బంధువు విద్యుత్ మోటార్ నడవకపోవడంతో ఆదివారం స్తంభం ఎక్కారు. రిపేర్లు చేస్తుండగా షాక్ కొట్టి స్తంభంపైనే మృతిచెందారు.
దమ్మపేటలో ఎలక్ట్రీషియన్..​
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగలపల్లి గ్రామానికి చెందిన సోయం రాంబాబు(43) ఎలక్ట్రీషియన్​గా చేస్తున్నారు. ఆదివారం అదే గ్రామానికి చెందిన ప్రసాద్ తన ఇంటికి కరెంట్ రావడం లేదని చెప్పాడు. రిపేర్​చేసేందుకు రాంబాబు నిచ్చెన పైనుంచి కరెంటు స్తంభం ఎక్కి సర్వీస్ వైర్ పట్టుకోగా షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. గ్రామస్తులు కరెంట్ ఆఫీసర్లు, పోలీసులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు.