నల్లగొండ జిల్లా : గ్రేటర్ హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు కలవరపెడుతున్నాయి. ఫిబ్రవరి 23న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై కారు బోల్తా పడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన మరువక ముందే. లేటెస్ట్ గా ఇవాళ హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది.
కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం వద్ద కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు