నదిలో కొట్టుకుపోయిన కారు.. మంది గల్లంతు

నదిలో కొట్టుకుపోయిన కారు..  మంది గల్లంతు

ఉత్తరాఖండ్ రాంనగర్ దగ్గర వరదల ఉదృతికి ధేలా నదిలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది గల్లంతయ్యారు.  ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు దొరికాయి. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఒక బాలికను సురక్షితంగా కాపాడారు . తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. నైనిటాల్ నుంచి రాంనగర్ దారిలోని వంతెనపై వరద  ప్రవహిస్తుంది. మృతులందరూ పంజాబ్ కు చెందిన వారిగా గుర్తించారు అధికారులు.