వరద ఉధృతికి నదిలో కొట్టుకుపోయిన కారు

వరద ఉధృతికి నదిలో కొట్టుకుపోయిన కారు

ఉత్తరాఖండ్ రాంనగర్ దగ్గర వరద  ఉధృతికి ధేలా నదిలో  కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఒక బాలిక ప్రాణాలతో బయటపడింది. మరో ముగ్గురి కోసం  అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు మృతదేహాలు దొరికాయి. నైనిటాల్ నుంచి రాంనగర్ దారిలోని వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది.  తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగిందని కుమావోన్ రేంజ్ డిఐజి ఆనంద్ భరన్ తెలిపారు. మృతులందరూ పంజాబ్ కు చెందిన వారిగా గుర్తించారు.