పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు

పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు

హైద‌రాబాద్- లాక్ డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే బ్యాంకులు ప‌ని వేళ‌ల్లో మార్పులు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే  పోస్ట్ ఆఫీసులు కూడా పని వేళల్లో మార్పులు చేశాయి. లాక్ డౌన్ ఆంక్షలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్ పని వేళలను కుదిస్తు గురువారం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు  అధికారులు తెలిపారు.  పెద్ద పోస్ట్ ఆఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం  12  గంటల వరకు ప‌ని చేస్తాయ‌ని.. అలాగే చిన్న పోస్ట్ ఆఫీసుల్లో ఉదయం  8 గంటల నుండి 10 గంటల వరకు పని చేయనున్నాయని తెలిపారు. గురువారం నుండి ఈ  నిర్ణయం  అమల్లోకి  రానుందని.. శుక్ర‌వారం నుండి ఈ గౌడ్ లైన్స్ ప్ర‌కార‌మే ఆఫీసులు ప‌ని చేస్తాయ‌న్నారు. ఈ  మేరకు  సీనియర్ సూపరింటెండెంట్,  సికింద్రాబాద్ డివిజన్  కార్యాలయం  ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ కార‌ణంగా కార్యాలయాలు తక్కువ మంది సిబ్బందితో పని చేస్తాయని.. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరి కొనసాగుతాయని తెలిపింది. ఈ ప‌ని వేల‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల‌కు వ‌ర్తించ‌నున్నాయి.