కామారెడ్డి జిల్లాలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లాలో  రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి​, వెలుగు : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​  డాక్టర్లకు సూచించారు.  గురువారం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్​ నిర్వహించారు. అంతకు ముందు కలెక్టర్ హాస్పిటల్​లోని ఆయా విభాగాలను పరిశీలించారు.  రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. హాస్పిటల్​ డెవలప్​మెంట్ అంశాలపై చర్చించారు.  పేషెంట్ల రిజిస్ర్టేషన్​ కోసం షెడ్డు నిర్మాణంతో పాటు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

  ఆరోగ్య శ్రీ ఫండ్స్​ వినియోగం, ఇతర ఫండ్స్​ ఖర్చుపై కలెక్టర్ ఆరా తీశారు. ఆరోగ్య శ్రీ ఫండ్స్​ పక్కదారి పట్టాయనే ఫిర్యాదులపై వివరాలు అందజేయాలని అడిషనల్ కలెక్టర్​కు కలెక్టర్ సూచించారు. అడిషనల్ కలెక్టర్​ చందర్​నాయక్​, సూపరింటెండెంట్​ వెంకటేశ్వర్లు, డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.  

 మత్తు పదార్థాలు అరికట్టాలి.. 

డ్రగ్స్​, గంజాయి, కల్లీ కల్లు వంటి మత్తు పదార్థాలను అరికట్టాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.  గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. మత్తు పదార్థాలు తీసుకునే వారిని గుర్తించి మానిపించేందుకు అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్​ వినియోగం వలన కలిగే ఆనర్థాలపై కాలేజీల్లో అవగాహన  పోగ్రాంలు నిర్వహించాలన్నారు.  ఎస్పీ రాజేశ్​​ చంద్ర మాట్లాడుతూ డ్రగ్స్​ బారిన పడిన వారిని గుర్తించి డి అడిక్షన్ సెంటర్​కు తరలించాలన్నారు.  అడిషనల్ కలెక్టర్​ విక్టర్​,  జిల్లా ఎక్సైజ్​ అధికారి హన్మంత్​రావు,   డీఈవో రాజు,  డీఎంహెచ్​వో చంద్రశేఖర్​,  తదితరులు పాల్గొన్నారు.