నాగర్ కర్నూల్ జిల్లాలో బోగస్ పత్రాలతో ఆసుపత్రులు నడిపితే క్రిమినల్ కేసులు

నాగర్ కర్నూల్ జిల్లాలో బోగస్ పత్రాలతో ఆసుపత్రులు నడిపితే క్రిమినల్  కేసులు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బోగస్  పత్రాలతో ఆసుపత్రులు నడిపితే క్రిమినల్  కేసులు పెడతామని కలెక్టర్  బదావత్​ సంతోష్  స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. కొత్తగా వచ్చిన 21 ఆసుపత్రుల పత్రాలను పరిశీలించారా? అని డీఎంహెచ్​వోను అడిగి తెలుసుకున్నారు. 

జిల్లాలో 72 ప్రైవేట్  ఆసుపత్రులకు అనుమతి ఉందని, ప్రైవేట్  ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్, స్కానింగ్  సెంటర్లు నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలోని ప్రైవేట్​ ఆసుపత్రులను తనిఖీలు చేస్తానని, నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్  దేవసహాయం, అడిషనల్​ ఎస్పీ రామేశ్వర్, డీఎంహెచ్ వో స్వరాజ్యలక్ష్మి, ప్రైవేట్  ఆసుపత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు.