భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మైనార్టీ గురుకులాల్లో ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో ఆన్లైన్ ఆడ్మిషన్లను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కొత్తగూడెం, భద్రాచలంలో బాయ్స్కు, బూర్గంపహాడ్, అశ్వారావుపేట, ఇల్లెందులోని మైనార్టీ గురుకులాల్లో బాలికలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు.
ఐదో తరగతితో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ముస్లిం మైనార్టీ పిల్లలను మైనార్టీ గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. గురుకులాల్లో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు క్వాలిటీ భోజనం, ఆధునిక పద్ధతిలో సౌకర్యాలను ప్రభుత్వం గురుకులాల్లో ఏర్పాటు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
