
- బదిలీ పై వెళ్తున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
- ఘనంగా వీడ్కోలు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం జిల్లా ప్రగతి కొనసాగించాలని, ఇక్కడ ప్రజలకు సంతోషాన్ని పంచుతూ పని చేయడంలో చాలా సంతృప్తి లభిస్తోందని బదిలీ పై వెళ్తున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా బదిలీపై వెళ్తున ముజమ్మిల్ ఖాన్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని జిల్లా అధికారుల బృందం ఘనంగా నిర్వహించింది. ముజమ్మిల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిని ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు.
అడిషనల్కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా అధికారులు, పలువురు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో తమకు ఉన్న అనుభవాలను తెలియజేశారు. అనంతరం ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు నేరుగా క్షేత్రస్థాయిలో ఇంటారాక్ట్ అవుతూ వారి సమస్యలు పరిష్కరించేందుకు తనకు అవకాశం లభించిన్నందుకు సంతోషంగా ఉందన్నారు. 12 నెలల కాలంలో తనకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురు ఉద్యోగులను ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సీపీ సునీల్ దత్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జడ్పీ సీఈవో దీక్షా రైనా, రెవెన్యూ డివిజన్ అధికారులు నర్సింహారావు, రాజేందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.