
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మితమవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేలా చూడాలని సూచించారు.
ప్రాథమిక పాఠశాల నుంచి ఐదో తరగతి అయిపోయిన విద్యార్థులను వెంటనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరో తరగతిలో చేర్పించే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు అక్షరభాస్యం చేయించి ఆంగ్లంలో రాయించారు. విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ హెచ్ ఎస్ ఇన్చార్జి హెడ్ మాస్టర్ కవిత, ఉపాధ్యాయులు వెంకట నర్సమ్మ, ప్రతాప్ కుమార్, రాజు, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.