
పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప అన్నారు. మంగళవారం పాపన్నపేటతో పాటు 35 పంచాయతీలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మండలంలో రెండు మూడు గ్రామాలకు మాత్రమే డబుల్ బెడ్ రూములు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలల్లోనే ప్రతి గ్రామంలో పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్. మల్లయ్య, అధ్యక్షులు రాములు, నరేందర్ గౌడ్, లక్ష్మణ్, శివ పాల్గొన్నారు