
రామచంద్రాపురం, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్నేతలు శనివారం సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ సీనియర్నాయకుడు గాలి అనిల్ కుమార్ సీఎం నివాసంతో మర్యాదపూర్వకంగా కలిసి తనపై నమ్మకంతో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మెదక్ పార్టమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఎంతో బలంగా ఉందని రాబోయే రోజుల్లో అన్ని అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట అనిల్ కుమార్ కుమారులు, జీఏకే ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు దర్పల్లి చంద్రం, అత్తు ఇమామ్ వేర్వేరుగా సీఎంని కలిశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే నామినేటెడ్ పోస్టులు వరిస్తాయని సీఎం తెలిపినట్లు పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం చెప్పారు.