సీఎంను కలిసిన పలువురు నేతలు

సీఎంను కలిసిన పలువురు నేతలు

రామచంద్రాపురం, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్​జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్​నేతలు శనివారం సీఎం రేవంత్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మెదక్​ పార్లమెంట్ కాంగ్రెస్​ సీనియర్​నాయకుడు గాలి అనిల్ కుమార్  సీఎం నివాసంతో మర్యాదపూర్వకంగా కలిసి తనపై నమ్మకంతో టీపీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

మెదక్​ పార్టమెంట్ పరిధిలో కాంగ్రెస్​ ఎంతో బలంగా ఉందని రాబోయే రోజుల్లో అన్ని అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్​ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట అనిల్ కుమార్​ కుమారులు, జీఏకే ఫౌండేషన్​ సభ్యులు ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు దర్పల్లి చంద్రం, అత్తు ఇమామ్ వేర్వేరుగా సీఎంని కలిశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే నామినేటెడ్ పోస్టులు వరిస్తాయని  సీఎం తెలిపినట్లు పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం చెప్పారు.