
- అడ్వైజరీ, డిసిప్లీనరీ, డీలిమిటేషన్, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీలు కూడా..
- నేడో, రేపో పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటించే చాన్స్
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా 70 మందితో ఐదు పీసీసీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ, డిసిప్లీనరీ, డీలిమిటేషన్తో పాటు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీలను ఏర్పాటు చేశారు.
పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 22 మంది ఉండగా.. వీరిలో స్టేట్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు ఉన్నారు. అలాగే ఎక్స్అఫీషియో సభ్యులుగా తెలంగాణకు చెందిన ఏఐసీసీ సెక్రటరీలు, బాధ్యులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల హెడ్స్, రాష్ట్ర మంత్రులకు చోటు కల్పించారు. ఇక 15 మందితో అడ్వైజరీ కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, ఆరుగురితో డిసిప్లీనరీ కమిటీ ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ (డిసిప్లీనరీ) కమిటీ చైర్మన్గా ఎంపీ మల్లు రవి, వైస్ చైర్మన్గా శ్యామ్ మోహన్ను నియమించారు. కాగా, ఒకట్రెండు రోజుల్లో పీసీసీ కొత్త కార్యవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని హైకమాండ్ వర్గాలు పేర్కొన్నాయి.
పొలిటికల్ అఫైర్స్ కమిటీ
స్టేట్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్ రెడ్డి, జి.రేణుకా చౌదరి, బలరాం నాయక్, డి.శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, షబ్బీర్ అలీ, మహ్మద్ అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, వి.శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఇల్లయ్య, పి.సుదర్శన్ రెడ్డి, కె. ప్రేమ్ సాగర్ రావు, జెట్టి కుసుమ్ కుమార్, ఈరవత్రి అనిల్ కుమార్
ఎక్స్-అఫీషియో సభ్యులు: తెలంగాణకు అనుబంధంగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల ప్రధాన బాధ్యులు
ప్రత్యేక ఆహ్వానితులు: రాష్ట్ర మంత్రులు
అడ్వైజరీ కమిటీ
మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వి.హనుమంత రావు, కె. జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్, జి.చిన్నారెడ్డి, జె.గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, జాఫర్ జావేద్, జీవన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్
డీలిమిటేషన్ కమిటీ
చల్లా వంశీచంద్ రెడ్డి, గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, డా. శ్రావణ్ కుమార్ రెడ్డి, పవన్ మల్లాది, డి.వెంకటరమణ
సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ
పి.వినయ్ కుమార్, అద్దంకి దయాకర్, కె.శంకరయ్య, బాలు నాయక్, అరకాల నర్సారెడ్డి, ఆత్రం సుగుణ, రాచమల్ల సిద్ధేశ్వరుడు, సంతోష్ కోల్కొండ, పులి అనిల్ కుమార్, జూలూరి ధనలక్ష్మి, మజీద్ ఖాన్, డాక్టర్ జి.రాములు, అర్జున్ రావు, సౌరి, కొల్లం వల్లభ రెడ్డి, వేణ్మం శ్రీకాంత్ రెడ్డి
డిసిప్లీనరీ కమిటీ
మల్లు రవి (చైర్మన్), ఎ.శ్యామ్ మోహన్ (వైస్ చైర్మన్), ఎం. నిరంజన్ రెడ్డి, బి.కమలాకర్ రావు, జాఫర్ జావేద్, జీవీ రామకృష్ణ. ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రులు ఉంటారు.