పెరిగిన ఆర్థిక మోసాలు.. 2025లో సంచలనం రేపిన చెన్నూర్ఎస్బీఐ గోల్డ్కేసు

పెరిగిన ఆర్థిక మోసాలు.. 2025లో సంచలనం రేపిన చెన్నూర్ఎస్బీఐ గోల్డ్కేసు
  •  సైబర్​ నేరాలూ పైపైకి.. జన్నారంలో బయటపడ్డ కాంబోడియా వ్యవహారం​
  • 16 మర్డర్లు, 61 కిడ్నాప్​లు, 35 రేప్​లు 
  • 275 చీటింగ్​, 323 మిస్సింగ్​కేసులు నమోదు
  • యాక్సిడెంట్లలో 136 మృతి, 435 మందికి గాయాలు 
  • ఈ చలాన్​ కేసుల్లో రూ.9.22 కోట్ల ఫైన్లు

మంచిర్యాల, వెలుగు: 2025 సంవత్సరంలో మంచిర్యాల జిల్లాలో సాధారణ నేరాలు తగ్గినప్పటికీ.. ఆర్థిక మోసాలు, సైబర్ ​క్రైమ్స్​పెరిగాయి. రామగుండం పోలీస్​కమిషనర్ అంబర్​కిశోర్​ ఝా శనివారం వివరాలు వెల్లడించారు. వీటిలో ఆగస్టులో వెలుగుచూసిన చెన్నూర్​ఎస్​బీఐ గోల్డ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. క్యాషియర్​రవీందర్​360 మంది కస్టమర్లు బ్యాంక్​లో తాకట్టు పెట్టిన 20.154 కిలోల బంగారాన్ని దొంగిలించాడు. 42 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాల ద్వారా మరో 4.2 కిలోల బంగారం చూపించి రూ.1.75 కోట్ల లోన్ తీసుకున్నాడు. స్ట్రాంగ్ రూమ్, ఏటీఎం నుంచి రూ.1.10 కోట్ల నగదు అపహరించాడు. ఈ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి సుమారు రూ.10 కోట్ల లోన్లు తీసుకున్నాడు. ఈ కేసులో మొత్తం 47 మంది నిందితులను గుర్తించి 13 మందిని అరెస్ట్ చేసి, 34 మందికి నోటీసులు జారీ చేశారు.

జన్నారం కేంద్రంగా సైబర్ ​నేరాలు

జన్నారం మండలం కిష్టాపూర్ ​గ్రామంలో కాంబోడియా  కేంద్రంగా నడుస్తున్న భారీ సైబర్​ క్రైమ్​ను పోలీసులు బయటపెట్టారు. సిమ్ బాక్స్ ద్వారా సైబర్ మోసాలు, అక్రమ టెలీ మార్కెటింగ్, స్పామింగ్ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు. ఈ ఏడాది జులై 7న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 262 సిమ్ కార్డులు, రూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులను అరెస్ట్​చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లాలో 120 సైబర్ క్రైమ్​కేసులు నమోదు కాగా, 17 మందిని అరెస్ట్ చేశారు. రూ.1.68 కోట్లు నిందితులు దోచుకోగా.. 67 కేసుల్లో రూ.46.41 లక్షలు రికవరీ చేశారు. 429 యాక్సిడెంట్లలో 136 మంది మృతి : ఈ ఏడాది 429 యాక్సిడెంట్లలో 136 చనిపోగా, 435 మందికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ‘అరైవ్.. అలైవ్’ ప్రోగ్రాం ద్వారా ఆర్​అండ్​బీ, ఎక్సైజ్, ఆర్టీవో, హైవే ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విలేజ్​ రోడ్​సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 39 బ్లాక్​ స్పాట్స్​ వద్ద యాక్సిడెంట్లను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు.

రూ.9.22 కోట్ల ఫైన్లు: ఈ ఏడాది జిల్లాలో 3.38 లక్షల ఈ- చలాన్​ కేసులు నమోదయ్యాయి. రూ.9.22 కోట్ల ఫైన్లు విధించారు. అలాగే 7,852 డ్రంక్​ అండ్​ డ్రైవ్​కేసులు నమోదు చేసి 4,353 మందికి రూ.75.76 లక్షల జరిమానా విధించారు. నలుగురికి జైలుశిక్ష విధించారు. 

323 మంది మిస్సింగ్: ఏడాది మంచిర్యాల జిల్లాలో 333 -మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒక బాలుడు, వంద మంది -పురుషులు, 232-మహిళలు ఉన్నారు. బాలుడితో పాటు 92- పురుషులు, 223- మహిళల ఆచూకీ కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

63 మందిపై హిస్టరీ షీట్స్: తరచూ అసాంఘిక 

కార్యకలాపాలకు పాల్పడుతున్న 63 మందిపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశారు. ఇందులో 20 మందిపై రౌడీ షీట్స్, 43 మందిపై సస్పెక్ట్ షీట్స్ తెరిచారు.13 మందిపై గ్యాంగ్​ఫైల్స్​ఓపెన్ ​చేశారు. లోక్ ​అదాలత్​ల ద్వారా 15,734 కేసులు పరిష్కరించారు. ఈ ఏడాది పెండింగ్​లో ఉన్న 336 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేశారు. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు: జిల్లాలో 108 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​రిజిస్టర్​ చేసిన వెంటనే బాధితులకు రూ.22.80 లక్షల నష్టపరిహారం కోసం రిపోర్ట్​ చేయగా, 47 కేసుల్లో ఎక్స్​గ్రేషియా మంజూరైంది. 62 కేసుల్లో చార్జిషీట్ వేసిన తర్వాత రూ.18 లక్షల ఎక్స్​గ్రేషియా కోసం రిపోర్ట్​ చేశారు. మరో 20 కేసుల్లో జడ్జిమెంట్​తర్వాత అందించే నష్టపరిహారం కోసం ప్రతిపాదన పంపారు. 

196 మంది చిన్నారులకు విముక్తి: ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్​ ముస్కాన్ ​ద్వారా 196 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. వారిని స్కూళ్లలో చేర్పించారు. అందులో 139- బాలురు, 57-బాలికలు ఉన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై 13 -కేసులు నమోదు చేసి 16 -మందిని అరెస్ట్ చేశారు. 

ఈవ్​టీజర్ల పనిపట్టిన షీ టీమ్స్​: షీ టీమ్స్​ ద్వారా 1,303 హాట్​స్పాట్లలో నిఘా ఉంచారు. అలాగే మహిళల భద్రత, నేరాలపై 300 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 362 మంది ఈవ్ టీజర్స్​ను స్కూళ్లు, కాలేజీలు, పరీక్షా కేంద్రాల, బస్ స్టాండ్లు వద్ద రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 41 మంది మైనర్స్, 284 మంది మేజర్లకు తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. 37 మందిపై ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. షీ టీమ్స్​కు 128 ఫిర్యాదులు రాగా, వివిధ పోలీస్​స్టేషన్లలో 42 ఎఫ్​ఐఆర్​లు, 12 ఈ పెట్టీ కేసులు ఫైల్​ చేశారు. 

మహిళలపై వేధింపులు : 29 పోక్సో కేసులతో కలిపి మొత్తం 35 రేప్​ కేసులు నమోదయ్యాయి. వేధింపుల కేసులు 325, వరకట్నం మరణాలు మూడు నమోదయ్యాయి.  

2700 ఫోన్ల రికవరీ: కమిషనరేట్ పరిధిలో 8,171 సెల్​ఫోన్లు పోవడంతో పాటు చోరీ అయ్యాయి. సీఈఐఆర్​ పోర్టల్ ​ద్వారా 2700 ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. 

ముఖ్యమైన కేసుల వివరాలు 

నేరం    2024    2025

గ్రేవ్​ కేసులు    122    92

చీటింగ్​    372    275

పెట్టీ కేసులు    10,132    10,962

మర్డర్లు    23    16

హోమిసైడ్​    08    08

కిడ్నాప్​    55    61

రేప్​    41    35

అటెంప్ట్​మర్డర్​    40    30

మిస్సింగ్​    273    323

క్రైమ్​ కేసులు    4,457    5,289