మైనర్ బాలికపై దాడి.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో భయానక విషయాలు

 మైనర్ బాలికపై దాడి.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో భయానక విషయాలు

మే 28న ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో సాహిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో బాలిక పోస్టుమార్టం నివేదికలో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె కడుపులో అంతర్గత అవయవాలు వేలాడుతున్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.

పోలీసులు ఆసుపత్రి నుంచి 16-17 పేజీల ఛార్జిషీట్‌ను స్వీకరించారు. అందులో హత్యకు సంబంధించిన భయంకరమైన వివరాలు వివరించబడ్డాయి. సాహిల్ చాలా తీవ్రంగా, క్రూరంగా దాడి చేసినట్టు పోస్ట్‌మార్టంలో తేలిందని, పేగుతో బాధిత బాలిక అంతర్గత అవయవాలు బయటకు వచ్చాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

నిందితుడు సాహిల్ ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి, ఆపై ఆమె తలను బండరాయితో బాదినట్లు నివేదిక వెల్లడించింది. బాధితుడి శరీరంపై ఉన్న అనేక కత్తిపోట్లు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. తల ప్రాంతంలో కొన్ని ఎముకలు పగుళ్లు, గాయాలతో కూడా ఉన్నట్టు తేలింది. బాలిక శరీరంలోని 16 కత్తిపోట్లలో, భుజం నుంచి తుంటి ప్రాంతం వరకు గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. అంతేకాదు ఆమె శరీరంలోని అనేక ఎముకలు విరిగిన స్థితిలో ఉన్నాయని, ఇది హత్య క్రూరత్వాన్ని చూపిస్తుందని నివేదిక తెలిపింది. వైద్యుల ప్రకారం, నిందితుడు సాహిల్ బాధితుడి శరీరంపై అనేకసార్లు క్రూరమైన దాడి చేసినందు వల్లే బాలికకు ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు.

ఘటనాస్థలం నుంచి కత్తి, బూట్లను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మే 28న న్యూఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాహిల్ అనే 20 ఏళ్ల వ్యక్తి మైనర్‌ని పలుమార్లు పొడిచి, ఆమె తలను బండరాయితో నలిపి చంపినట్లు పోలీసులు తెలిపారు.