
రైలుబండిలో జర్నీ మంచిగనిపిస్తది. కానీ, రైల్వేస్టేషన్లో ఫుడ్ తిందామంటే తినబుద్ది కాదు. కారణం చాలావరకు పరిసరాలు అంత శుభ్రంగా ఉండకపోవడమే. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో అలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడి రైలుడబ్బాలో కూర్చొని కడుపారా నచ్చిన ఫుడ్ తినొచ్చు. ఆ రైల్వేస్టేషన్లోని పద్దెనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఒక రైలు బోగీ ఆగి ఉంటుంది. దాని పేరు ‘బోగీ వాగీ’. అదొక రెస్టారెంట్. పాత రైలు డబ్బాకి రంగులు వేసి, బోగీ మీద ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్, తాజ్హోటల్, ఒబెరాయ్ హోటల్ బొమ్మలు వేసి అందంగా డెకరేట్ చేశారు. లోపల కుర్చీలు, టేబుళ్లు వేసి రెస్టారెంట్ లుక్ తెచ్చారు. ఇందులో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ వంటకాలతో పాటు చైనీస్ రుచుల్ని కూడా వడ్డిస్తున్నారు. రైల్వేస్టేషన్ దగ్గర్లోని ‘హెరిటేజ్ గల్లీ’లో ఉన్న ఈ రెస్టారెంట్ సెంటరాఫ్ అట్రాక్షన్.
ఇలాంటివి మరికొన్ని చోట్ల
‘‘ఈ కోచ్ వాడుకలో లేదు. అందుకే దీన్ని రెస్టారెంట్గా మార్చాం. ఈ రెస్టారెంట్ కస్టమర్లకి మంచి ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. ఇందులో పది టేబుళ్లు ఉంటాయి. 40 మంది ఒకేసారి తినొచ్చు. పార్శిల్ సౌకర్యం కూడా ఉంది. రైల్వే ప్యాసింజర్లతో పాటు బయటివాళ్లకి కూడా ఎంట్రీ ఉంది. ఈ రెస్టారెంట్ ఐడియా బాగా క్లిక్ అయింది. దాంతో లోకమాన్య తిలక్ టెర్మినల్, కల్యాణ్ జంక్షన్, లోనావాలా రైల్వేస్టేషన్లలో కూడా ఇలాంటి రెస్టారెంట్లు నడపా లనే ఆలోచనతో ఉన్నాం” అంటున్నాడు సెంట్రల్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్.