కేటీఆర్ సంప్రోక్షణ వ్యాఖ్యలు సిగ్గుచేటు

కేటీఆర్ సంప్రోక్షణ వ్యాఖ్యలు సిగ్గుచేటు

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అపవిత్రం చేశారని మంత్రి కేటీఆర్ అనడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  ఫైర్​ అయ్యారు. ఆలయాన్ని సంప్రోక్షణ  చేయాలని కేటీఆర్ ఆదేశించడం సిగ్గుచేటన్నారు. యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చినంత మాత్రాన కల్వకుంట్ల గుడిగా మారుతుందా అని నిలదీశారు. దేవుడిని నమ్మని కేటీఆర్ నోటి వెంట ఆ పదం రావడం దురదృష్టకరమన్నారు. గురువుగా భావించే అమిత్ షా చెప్పులను సంజయ్  తీసి పక్కన పెడితే తప్పుబట్టడం ఏంటని ప్రశ్నించారు. 

బద్నాం చేస్తున్నరు: ప్రేమేందర్‌ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీని బద్నాం చేస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి అన్నారు. పోలీసుల విచారణ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటంతో హైకోర్టును ఆశ్రయించానన్నారు. మునుగోడు బైపోల్ ముగిసే వరకు విచారణ వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ లేదా జ్యూడిషియల్‌కు అప్పగించాలని కోరినట్టు వివరించారు.