మంత్రి ప్రశాంత్ రెడ్డి పీఆర్వో శ్రీకాంత్ పై వరకట్నం కేసు

 మంత్రి ప్రశాంత్ రెడ్డి పీఆర్వో శ్రీకాంత్ పై వరకట్నం కేసు

పెద్దపల్లి జిల్లా: రోడ్లు & భవనాలు, శాసన వ్యవహారాలు మరియు హౌసింగ్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేస్తున్న తోట శ్రీకాంత్ పై 
మంథని పోలీస్ స్టేషన్లో వరకట్నం కేసు నమోదు అయింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం ఏదులపూర్ కు చెందిన తన భర్త శ్రీకాంత్ అదనపు కట్నం కోసం దాడి చేశాడని ఆయన భార్య తోట కోమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

కొద్ది రోజులుగా భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో భర్త శ్రీకాంత్ చేతిలో తీవ్రంగా గాయపడింది. పోలీసుల సమక్షంలో మంథని ప్రభుత్వ హస్పిటల్లో చికిత్స చేయించుకుంది తోట కోమల. ఆమె స్వగ్రామం మంథని మండలం గాజులపల్లి. తాను మంత్రి వద్ద పనిచేస్తున్నానని.. నా వెనుక మంత్రి ఉన్నాడు.. నన్ను పోలీసులు చేమీ చేయలేరని బెదిరిస్తూ దాడి చేసి నట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు.