
నిజామాబాద్, వెలుగు: రూరల్ సెగ్మెంట్ పరిధిలో జలాల్పూర్ విలేజ్కు చెందిన గాంధారి లక్ష్మీ ట్రీట్మెంట్కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువ ఎల్వోసీని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అందించారు. లోబ్ న్యూమోనియాతో బాధపడుతున్న ఆమె సాయం కోసం ఎమ్మెల్యేను సంప్రదించగా ఎల్వోసీ మంజూరు చేయించారు.