
- ఫలక్నుమా మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్సిటీ, వెలుగు: పాతబస్తీ ఫలక్నుమాలో గత శుక్రవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ స్నేహ మెహరా సోమవారం ఫలక్నుమా పీఎస్లో వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన ఎండీ మజీద్(26) కుటుంబం, ప్రధాన నిందితుడు షేక్మహ్మద్అలీ కుటుంబం 2018లో బండ్లగూడలోని ఇరుగుపొరుగు ఇండ్లలో ఉండేవారు. ఆ టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తర్వాత మజీద్కుటుంబం ఫలక్నుమాకు మారింది. కొంతకాలం తర్వాత షేక్ మహ్మద్ అలీ తల్లి చనిపోయింది. అతడి సోదరుడు అనారోగ్యపాలయ్యాడు. మజీద్కుటుంబ సభ్యులంతా కలిసి చేతబడి చేయించడంతోనే ఇలా జరిగిందని మహ్మద్అలీ అనుమానించాడు.
మజీద్కుటుంబంపై పగ పెంచుకుని అతడిని చంపాలని స్కెచ్వేశాడు. ఈ నెల 2న మధ్యాహ్నం మహ్మద్ అలీ కుటుంబ సభ్యులైన ఉస్మాన్అలీ, అక్తర్అలీతో కలిసి నూర్ఫంక్షన్హాల్సమీపంలోని నైస్హోటల్దగ్గర కాపు కాశాడు. మజీద్అక్కడకు రాగానే కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. మృతుడి సోదరుడు మహమ్మద్ అజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్మీట్లో ఇన్స్పెక్టర్ కె.ఆదిరెడ్డి, ఏసీపీ జావిద్ఉన్నారు.