
భద్రాచలం,వెలుగు: ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్గించారంటూ పీవో బి.రాహుల్ డాక్టర్లను అభినందించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తొలిసారి లేప్రోస్కోపిక్ సర్జరీ చేసిన డాక్టర్లను సోమవారం తన చాంబర్లో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్మాట్లాడుతూ నిరుపేదల కష్టాలను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల సేవలు మరువలేనివన్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూపరింటెండెంట్ రామకృష్ణకు సూచించారు.