24 దేశాల విమానాలను బ్యాన్​ చేసిన ఒమన్

24 దేశాల విమానాలను బ్యాన్​ చేసిన ఒమన్

మస్కట్: కరోనా కేసులు పెరుగుతున్నందున ఇండియా ​సహా మొత్తం 24 దేశాల విమాన సర్వీసులపై గల్ఫ్​దేశం ఒమన్ నిషేధం విధించింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు బ్యాన్​ కొనసాగుతుందని అధికారిక ట్విట్టర్​అకౌంట్​ ద్వారా వెల్లడించింది. విమాన సర్వీసు​లు క్యాన్సిల్​ చేసిన దేశాల్లో బ్రిటన్, ట్యునీషియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, లిబియా, బ్రూనీ, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇథియోపియా, సూడాన్, టాంజానియా, సౌత్​ఆఫ్రికా, ఘనా, సియెర్రా లియోన్, నైజీరియా, గినియా, కొలంబియా, అర్జెంటీనా, బ్రెజిల్, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్​ ఉన్నాయి. కాగా ఒమన్​లో బుధవారం ఒక్కరోజే 1,675 కొత్త కేసులొచ్చాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,80,235కు చేరింది. ఒమన్​లో ఇప్పటి వరకు 3,356 మంది కరోనాతో మరణించారు.