Gold Rate: క్రాష్.. క్రాష్.. వరసగా మూడోరోజు తగ్గిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో తులం ఎంతంటే?

Gold Rate: క్రాష్.. క్రాష్.. వరసగా మూడోరోజు తగ్గిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో తులం ఎంతంటే?

Gold Price Today: అమెరికా చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్న వేళ ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లకు దూరంగా జరుగుతున్నారు. దీంతో వరుసగా మూడోరోజు కూడా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు షాపింగ్ చేయటానికి ముందు తమ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తప్పక తెలుసుకోవాలి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.వెయ్యి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 945, ముంబైలో రూ.8వేల 945, దిల్లీలో రూ.8వేల 945, కేరళలో రూ.8వేల 945, కలకత్తాలో రూ.8వేల 945, వడోదరలో రూ.8వేల 950, జైపూరులో రూ.8వేల 960, లక్నోలో రూ.8వేల 960, మంగళూరులో రూ.8వేల 945, నాశిక్ లో రూ.8వేల 948, అయోధ్యలో రూ.8వేల 960, బళ్లారిలో రూ.8వేల 945, నోయిడాలో రూ.8వేల 960, గురుగ్రాములో రూ.8వేల 960 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.వెయ్యి 100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 758, ముంబైలో రూ.9వేల 758, దిల్లీలో రూ.9వేల 773, కేరళలో రూ.9వేల 758, కలకత్తాలో రూ.9వేల 758, వడోదరలో రూ.9వేల 763, జైపూరులో రూ.9వేల 773, లక్నోలో రూ.9వేల 773, మంగళూరులో రూ.9వేల 758, నాశిక్ లో రూ.9వేల 761, అయోధ్యలో రూ.9వేల 773, బళ్లారిలో రూ.9వేల 758, నోయిడాలో రూ.9వేల 773, గురుగ్రాములో రూ.9వేల 773గా ఉన్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.89వేల 450 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.97వేల 580గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 17వేల 900 వద్ద ఉంది.