అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో హుక్కా కేంద్రాలపై నిషేదించే సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు బిల్లు ప్రవేశ పెట్టగా సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సభకు దన్యవాదాలు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.
హుక్కా సెంటర్లపై నిషేదం అవసరమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. యువత ధూమపానానికి వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు. పొగ కంటే హుక్కా మరింత హానికరమని చెప్పారు. అంతకుముందు దివగంత సభ్యలుకు శాసనసభలో సంతాపం తెలిపారు. ఫిబ్రవరి 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే హుక్కా నిషేధంపై నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటించలేదు.
హుక్కా అనేది సిగరెట్లతో పోల్చితే వెయ్యి రెట్లు హానికరం.. ఒక్కసారి హుక్కాకు అలవాటు అయితే.. యువత బానిసలుగా మారిపోతారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని యువత, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. హుక్కాను.. హుక్కా సెంటర్లను శాశ్వతంగా నిషేధం విధిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.
హుక్కా నిషేధంపై బిల్లును సభలో ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పార్టీలు ఒకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు రాకతో.. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి వస్తుంది. హుక్కాకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులను అమ్మటం, కొనటం నేరం.