
జీడిమెట్ల, వెలుగు: దొంగ నోట్లు తరలిస్తున్న ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్గోదావరి జిల్లాకు చెందిన పత్తిపాటి ప్రేమ్చంద్కు పుణేకు చెందిన రాకేశ్తో పరిచయం ఏర్పడింది. అతను ఈజీ మనీ కోసం దొంగ నోట్లు ఏవిధంగా సరఫరా చేయాలో ప్రేమ్ చంద్కు చెప్పడంతో ఒప్పుకున్నాడు.
రాకేశ్ సూచనతో అవసరమైన వారికి దొంగ నోట్లు ఇచ్చేందుకు శనివారం మధ్యాహ్నం నిజాంపేట్ఆర్చి వద్ద వేచి చూస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి, ప్రేమ్చందర్ను పట్టుకున్నారు. రూ.500 దొంగ నోట్లు(రూ.15 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్చేసినట్లు సీఐ పేర్కొన్నారు.