దొంగ నోట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

దొంగ నోట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: దొంగ నోట్లు తరలిస్తున్న ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. సీఐ ఉపేందర్​ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్​గోదావరి జిల్లాకు చెందిన పత్తిపాటి ప్రేమ్​చంద్​కు పుణేకు చెందిన రాకేశ్​తో పరిచయం ఏర్పడింది. అతను ఈజీ మనీ కోసం దొంగ నోట్లు ఏవిధంగా సరఫరా చేయాలో  ప్రేమ్ చంద్​కు చెప్పడంతో ఒప్పుకున్నాడు.

రాకేశ్ సూచనతో అవసరమైన వారికి దొంగ నోట్లు ఇచ్చేందుకు శనివారం మధ్యాహ్నం నిజాంపేట్​ఆర్చి వద్ద వేచి చూస్తున్నాడు.  పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి, ప్రేమ్​చందర్​ను పట్టుకున్నారు. రూ.500 దొంగ నోట్లు(రూ.15 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్​చేసినట్లు సీఐ పేర్కొన్నారు.