- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట, తూము, కట్ట మైసమ్మ ఆలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సుందరీకరణకు ప్రభుత్వం రూ.18 కోట్లు కేటాయించిందన్నారు.
ప్రణాళిక ప్రకారం పనులు స్పీడ్గా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఎస్ఈ రవిశంకర్, హెచ్ ఎండీఏ ఈఈ రజిత, హెచ్ ఆర్డీసీఎల్ ఈఈ మహబూబ్ మియా, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
