
- ఇంజనీరింగ్ కాలేజిల్లో పెరుగుతున్న ఏఐ, మెషీన్ లెర్నింగ్ సంబంధిత కోర్సులు
న్యూఢిల్లీ: ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రొఫెషనల్స్కు డిమాండ్ భారీగా పెరగనుంది. 2026 నాటికి 10 లక్షల మంది స్కిల్డ్ వర్కర్స్ అవసరమని రిపోర్ట్స్ అంచనా వేస్తున్నాయి. 2047 నాటికి ఇండియా 23–-35 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ, ఆటోమేషన్, ఇన్నోవేషన్ వల్ల జాబ్ మార్కెట్ వేగంగా మారుతోంది. దీనికి తగ్గట్టు హయ్యర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సులో మార్పులు వస్తాయని అంచనా.
ఇంజనీరింగ్ కాలేజిల్లో కంప్యూటర్ సైన్స్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్చెయిన్ లాంటి విభాగాల్లో సీట్లు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఇండస్ట్రీ నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారం, ఇండియా ఏఐ ఇండస్ట్రీ 2025 నాటికి 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఏడాదికి 45శాతం వృద్ధి చెందుతుంది. 2016–-2023 మధ్య ఏఐ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ 14 రెట్లు పెరిగారు. సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతో పాటు ఏఐ ప్రొఫెషనల్స్ వేగంగా పెరుగుతున్న టాప్ 5 దేశాల్లో ఇండియా ఉంది.